ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లా పామర్రులో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నది. సీఎం జగన్ పామర్రులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్ధుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ జమ చేస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు.. 🎙️🏛️