వివిధ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు..
- MediaFx
- Jun 4, 2024
- 1 min read
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 290 స్థానాల్లో ముందంజలో ఉంది. 2019 ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 57 స్థానాలు తక్కువగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 88 స్థానాలు, సమాజ్వాది పార్టీ 32 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 2019 ఎన్నికలతో పోల్చితే, కాంగ్రెస్ 36 స్థానాలు ఎక్కువగా ముందంజలో ఉంది.
ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 80 స్థానాల్లో బీజేపీ 39, ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మహారాష్ట్ర:
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి 27, ఎన్డీఏ 20, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
కర్ణాటక:
కర్ణాటకలో బీజేపీ 17, కాంగ్రెస్ 8, జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీ:
ఢిల్లీ లో బీజేపీ 6, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
బీహార్:
బీహార్లో ఎన్డీఏ జేడీయు 15, బీజేపీ 12, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ 29, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
గుజరాత్:
గుజరాత్ లో బీజేపీ 25, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ టీడీపీ 14, బీజేపీ 4, జనసేన 2, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
తెలంగాణ:
తెలంగాణ లో కాంగ్రెస్ 9, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్ లో బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కేరళ:
కేరళ లో కాంగ్రెస్ 13, ఐయూఎంఎల్ 2, బీజేపీ 2, సీపీఎం 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పంజాబ్:
పంజాబ్ లో కాంగ్రెస్ 6, ఆప్ 3, శిరోమణి అకాలీదళ్ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్:
ఛత్తీస్గఢ్ లో బీజేపీ 10, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.