🏏 టీమిండియా దెబ్బకు.. ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ గతే పట్టనుందా..
- Shiva YT
- Nov 18, 2023
- 1 min read
🏆 ఫైనల్కు ముందు, 2023 ప్రపంచకప్లో నరేంద్ర మోదీ స్టేడియంలో 4 మ్యాచ్లు జరిగాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ కూడా అక్టోబర్ 5న ఈ మైదానంలోనే జరిగింది.

ఇందులో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. దీని తరువాత, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఇక్కడ చెరో మ్యాచ్ ఆడాయి. రెండు జట్లు తమ మ్యాచ్లను గెలుచుకున్నాయి. టీం ఇండియా పాకిస్థాన్తో తలపడగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చాలా సులభంగా గెలిచింది.
🏏 పాకిస్థాన్తో జరిగిన పిచ్పైనే..
ఇప్పుడు ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్థాన్పై ప్రదర్శించిన శైలినే ప్రదర్శించాలనుకుంటోంది. దీనికి కారణం కూడా ఉంది. పాకిస్థాన్ను టీమ్ ఇండియా ఏ పిచ్పై ఓడించిందో అదే పిచ్పై భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా కేవలం 191 పరుగులకే పాకిస్థాన్ను చిత్తు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ స్పిన్ పాకిస్థాన్ను చిత్తు చేసింది. 🇮🇳🇵🇰