నయనతార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికాకే రెమ్యూనరేషన్ ఎక్కువ?.🎥💃
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్'. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.దాదాపు 200 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్'. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.దాదాపు 200 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నాలుగు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికా పడుకోణెకే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కినట్లు సమాచారం. ఈ మూవీకిగానూ నయనతార 11 కోట్లు పారితోషికం తీసుకోగా.. దీపికా 17 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతినాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి 21 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 🎬🍿