ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్15 పేరుతో 5జీ ఫోన్ను తీసుకొస్తోంది.
ఈ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుండగా ప్రస్తుతం కంపెనీ ప్రీ బుకింగ్స్ను ప్రారంభించింది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్తో కూడిన సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుందికెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ను 4జీబీ, 6జ జీబీ ర్యామ్తో పాటు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్తో తీసుకురానున్నారు.ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను ఉచితంగా అందిస్తారు.ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499కాగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్ను సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే, బ్లూ టోపేజ్ కలర్స్లో తీసుకురానున్నారు.